మధుర మీనాక్షి
" మధుర మీనాక్షి ఆలయం :
ఈ ఆలయం ప్రతేకత ఏమిటంటే నలుదిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనబడుతుంది. తూర్పు, పశ్చిమ గోపురాలను పదమూడు, పదనాలుగవ శతాబ్దంలో సుందర పాడ్యన్, పరాక్రమ పాండ్యన్లు నిర్మించారని, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని స్థల పురాణం. ఈ గోపురం 160 అడుగుల ఎత్తు ఉంది. ఇక్కడ కొలువైవున్న దేవతలు సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం తొలుత మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. మీనాక్షి అమ్మవారి దర్శనానికి తూర్పు వైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. ఈ ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మ వారి కళ్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడి వున్నాయి. ఈ ఆలయంలో స్వర్ణ కమల తటాకము చూపరులను అట్టే ఆకర్షిస్తుంది. మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం. ఇది భారత తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు రూపంలో శివ దేవుడికి మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటిది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలకు నిలయంగా ఉంది. ఇవి అద్భుతమైన శిల్ప. చిత్రకళారీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది. తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది. అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక.
హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని (పార్వతి, హిందువల దేవత) పార్వతి అవతారాన్ని పెల్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చారు. మదుర పాలకుడు(మలయధ్వజ పాడ్య) చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో బూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూమ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది. ఎందుకంటే భూమండలం మొత్తంగా మదురై సమీపానికి వచ్చి చేరింది. మీనాక్షి సోదరుడు విష్ణు, పెళ్లి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుండి తరలివచ్చాడు. దేవతల నాటకం కారణంగా ఇతడు ఇంద్ర దేవుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా పెళ్లి తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడుపవలాకనైవాల్ పెరుమాళ్ ద్వారా జరిగిపోయింది. ఈ పెళ్లి గురించి ప్రతి ఏటా మదురైలో చిత్తిరై తిరువిళగా జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పాలనలో, పాలకుడు తిరుమలై నాయకర్ అళకర్ తిరువిళాకు మీనాక్షి పెళ్లికి జత కుదిర్చారు. అందుచేత అళకర్ తిరువిళా లేదా చిత్తిరై తిరువిళ పుట్టింది.
ఆధునిక చరిత్ర:
ఈ ఆలయ నిర్మాణ చరిత్ర సరిగా తెలియదు. కాని గత రెండు వేల సంవత్సరాలుగా తమిళ సాహిత్యం ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ ఉంది. తిరుజ్ఞానసంబంధర్, సుప్రసిద్ధ శైవర తత్వ శాస్ర్తంకి సంబంధించిన హిందూ మహర్షి, ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పేర్కొన్నారు. ఇక్కడ దేవుడిని అలవాయి ఇరైవన్ అని వర్ణించారు. ముస్తిం దురాక్రమణదారు మాలిక్ కపూర్ ద్వారా ఈ ఆలయం 1310లో కూల్చివేయబడినట్లు భావించబడింది మరియు దీనికి సంబంధించిన అన్ని పాత ఆనవాళ్లు ధ్వంసమైపోయాయి. ఈ ఆలయాన్ని పునర్నర్మించాలనే నిర్ణయం మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు (1559-166 A.D.) తీసుకున్నాడు. నాయక వంశం ప్రధానమంత్రి మరియు పొలిగర్ సిస్టమ్ నిర్మాత అయిన అరియనాథ ముదలియార్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. తర్వాత తిరుమలై నాయక్ రాజు సిర్కా 1623 నుండి 1659 వరకు దీనికి సహాయం చేశాడు. ఆలయం లోపల వెలుపల అనేక మండపాలు(వీరవసంతరాయర్ మండపం) నిర్మించబడంలో ఇతడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వసంతోత్సవాన్ని నిర్వహించేందుకోసం వసంత మండపాన్ని, కిలికొట్టు మండపాన్ని నిర్మించాడు. మరియు తెప్పకులమ్ వంటి రహదార్లు రాణి మంగమ్మాళ్చేత నిర్మించబడ్డాయి. మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ర్టంలోని రెండో అతిపెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది.
ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్రైన ఈఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో సర్వాంగా సుందరంగా మలచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది. కులశేఖర పాండ్యుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు చోచుకుంది.
ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.
పరమశివుడు సుందరేశ్వరునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షి అమ్మవారిని వివాహమాడాడడని , అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజుల్లో ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఆలయంలో ఊంజల మండపం వద్ద ఇరువైపులా ఉన్న దేవతలు ప్రతి శుక్రవారం రోజు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించేవారన్న కథ కూడా ఉంది.
ఎలా చేరుకోవాలి:
రోడ్డుమార్గం ద్వారా రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ప్రతి గంటకోసారి బస్సు సౌకర్యం ఉంది. దీనితోపాటు బెంగళూరు, కంచి వంటి ముఖ్య ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు బస్సు సర్వీసులు ఉన్నాయి. బస్సులో 12 గంటల పాటు ప్రయాణిస్తే మదురై పట్టణానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి మదురైకు రైలు సర్వీసులు నడుపుతన్నారు. వీటితోపాటు ఉత్తరభారత దేశంలోని కొన్ని ముఖ్య నగరాల నుంచి వారాంతపు రైలు సర్వీసులను భారత రైల్వే శాక నడుపుతుంది. రైలు ప్రయాణంలో సుమారు ఏడు గంటల పాటు సాగుతుంది. కొయ్యంబత్తూరుల నుంచి ప్రైవేట్, ప్రభుత్వ విమాన సర్వీసులు తిరుగుతున్నాయి.
"
